స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు పరిహారం చెల్లించిన టీటీడీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో 7 మంది బాధితులకు శనివారం పరిహారాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు. స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ జరిగిన సమావేశంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే శ్రీ గాలి భాను ప్రకాష్, టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్వీ కుమార్ ల సమక్షంలో చెక్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారికి పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలకమండలిలోని కొంత మంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, నర్సీపట్నం సందర్శించే బృందంలో పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ జంగా కృష్ణ మూర్తి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీ దేవి, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ ఎం.ఎస్ రాజు, శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి ఉండగా, తమిళనాడు, కేరళ బోర్డర్ సందర్శించే కమిటీలో శ్రీ రామమూర్తి, శ్రీ కృష్ణ మూర్తి, శ్రీ వైద్య నాథన్, శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంతా రామ్, శ్రీమతి సుచిత్రా ఎల్లా ఉన్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు నియమించిన రెండు కమిటీలకు సంబంధించి రవాణా తదితర ఖర్చులను టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు సొంత నిధుల నుంచి చెల్లించనున్నారు.

Share this post with your friends