తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక గమనిక విడుదల చేసింది. భక్తుల సౌకర్యం, పరిపాలనా అవసరాల దృష్ట్యా తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 9 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ విధానంలో టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆధార్ ధృవీకరణతో పాటు మొబైల్ నంబర్ తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మార్పులు నెలరోజులు పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా శ్రీవారి దర్శనం మరింత సులభంగా, సవ్యంగా సాగుతుందని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది.

