30 నుంచి శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ మహోత్సవాలు మే 2వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ వివిధ సాహితీ సదస్సులతో పాటు సంగీత కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ అవతార మహోత్సవాలు ఏప్రిల్ 30 వ తేదీ సాయంత్రం ప్రారంభం కానున్నాయి.

ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగ‌ళశాస‌నాల‌తో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం పలువురు ప్రముఖుల ఉపన్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

Share this post with your friends