బాసరలో ఆలయ అర్చకులు వర్సెస్ బీజాక్షరాలు..

నిర్మల్ జిల్లా బాసర ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఆలయంలో అక్షరం.. వేదపాఠశాల బీజాక్షరాల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఆధిపత్యం కోసం ఇరువురి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరేమో అటు జ్ఞాన సర్వస్వతీ అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయిస్తే.. మరొకరేమో వేదపాఠశాలలో నాలుకపై బీజాక్షారాలు రాయిస్తారు. ఇది చాలా కాలంగా జరుగుతున్న తంతే. కానీ వేదపాఠశాలకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అది గ్రహించిన ఆలయ అధికారులు తేరుకుని శాస్త్రోక్తంగా.. వేదమంత్రాల మధ్య జరిగే అక్షరాభ్యాసాన్ని కాదని.. బీజాక్షరాల వైపు ఎలా వెళతారంటూ భక్తులపై ఫైర్ అవుతున్నారు.

కొందరు భక్తులైతే ఆలయంలోనూ.. వేదపాఠశాలలోనూ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో బీజాక్షరాలకు డిమాండ్ పెరిగింది. అక్కడికి భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో అమ్మవారి ఆలయ అర్చకులు, అధికారులు ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆలయ అర్చకులకకు వేద పాఠశాల నిర్వాహకులకు మధ్య సయోద్య కుదిరిందంటూ వార్తలొచ్చాయి. అయితే దీనిని ఆలయ అర్చకులు ఖండిస్తున్నారు. వేద భారతి పాఠశాలకు తామేమీ వ్యతిరేకులం కాదని.. కేవలం బీజాక్షరాలకు మాత్రమే వ్యతిరేకమని చెబుతున్నారు. అలాగే గోదావరి ఘాట్ వద్ద సైతం గంగాహారతి పేరిట విచిత్ర పూజలతో బాసర ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నారు.

Share this post with your friends