తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం మాదిరిగానే పలు దేవాలయాల్లో ప్రతి నెలా విశేష ఉత్సవాలు ఉంటాయి. వాటిని నెలకు కొద్ది రోజుల ముందు ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాల వివరాలను ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. అప్పలాయగుంటలో మే 2 నుంచే విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మే 19న స్వామివారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• మే 2, 9, 16, 23, 30వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ అభిషేకం.
• మే 6న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
• మే 14న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
• మే 19న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం