ఒంటిమిట్టలో ఒకే శిలపై సీతారామలక్ష్మణులు..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఈ క్రమంలోనే నేటి సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే రేపు శ్రీరామనవమి కావడంతో రాముల వారి కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు.

పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీ రామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో రాముల వారు సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేశాడట. దీంతో నీటి బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయిందని పురాణాలు చెబుతున్నాయి. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.

Share this post with your friends