ఇకపై సీనియర్ సేవకులు.. గ్రూప్ లీడర్స్గా సీనియర్ సేవకులు వ్యవహరించనున్నారు. అయితే అసలు ఈ గ్రూప్ లీడర్స్కు ఎంత వయసుంాలి? ఎన్ని రోజుల పాటు శ్రీవారి చేయవచ్చు తదితర విషయాల గురించి తెలుసుకుందాం. గత రెండు సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు నమోదు కావచ్చు. ఇప్పుడు వీరిని గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు. వీరు 15 రోజుల, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు.
గ్రూప్ లీడర్స్ బాధ్యతలు
ఈ గ్రూప్ లీడర్స్ శ్రీ మలయప్ప స్వామివారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారు హాజరు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్క సేవకుని/సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.
పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం
కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని తెలియజేయడమైనది.