తిరుమల కల్యాణవేదికకు నూతన వదూవరుల నుంచి విశేష స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కల్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తిరుమలలోని కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుండి 2025 మే 1వ తేదీ వరకు 26,214 వివాహాలు అయ్యాయి. ఇందులో భాగంగా పురోహితుడు, మంగళవాయిద్యంతోపాటు పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టీటీడీ ఉచితంగా అందిస్తుంది.

వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి. వివాహాం అనంతరం రూ.300/-ల ప్రత్యేక ప్రవేశం ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ వద్ద గల క్యూలైన్ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 మంది 6 లడ్డూలను లడ్డూ కౌంటర్లు నందు పొందాలి.

Share this post with your friends