శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 11 రోజుల పాటు జరుగనున్నాయి. సుమారు 8 లక్షల మంది భక్తులు వస్తారని ఈవో శ్రీనివాసరావు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుంచి 1 వరకూ ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నేటి నుంచి శివస్వాములకు మాత్రమే సర్వ దర్శనం కల్పించనున్నారు. మార్చి 23 వరకూ ఉచిత సర్వదర్శనం కల్పిస్తామని వెల్లడించారు. శివస్వాములకు చంద్రావతీ కల్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామన్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు..

19న ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం ధ్వజారోహణ
20వ తేదీన భృంగివాహన సేవ
21వ తేదీన హంసవాహనసేవ
22వ తేదీన మయూరవాహనసేవ
23వ తేదీన రావణవాహన సేవ
24వ తేదీన పుష్పపల్లకీ సేవ
25వ తేదీన గజవాహనసేవ
26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
27న రథోత్సవం తెప్పోత్సవం 28న యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ మార్చి 01 అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం

Share this post with your friends