మే 5 నుండి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఏప్రిల్ 16: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మే 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి. రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు..

05-05-2025

ఉదయం – ధ్వజారోహణం (క‌ర్కాట‌క‌ లగ్నం- మ‌ధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – శేష వాహనం

06-05-2025

ఉదయం – తిరుచ్చిఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

07-05-2025

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

08-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

09-05-2025

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

10-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

11-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

12-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

13-05-2025

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Share this post with your friends