వరూధిని ఏకాదశి నాడు పూజ ఎలా చేయాలి?

వరూధిని ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తానే నిద్ర లేచి పవిత్ర నదీ స్నానం చేయాలి. ఒకవేళ నదీ స్నానం వీలుపడకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. వరూధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు అవతారమైన వామనమూర్తిని పూజించుకుంటాం అని చెప్పుకున్నాం కదా. ఆ తరువాత వామనమూర్తి చిత్రపటం పెట్టి దీపారాధన చేయాలి. దీపారాధన అనంతరం వీలైతే “దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వ దేవానాం వామనాయ నమో నమః” అనే శ్లోకాన్ని పఠించాలి. అది చదవడం కుదరని వాళ్లు ‘ఓం బాల వామన రూపిణే శ్రీ మహా విష్ణవై నమః!’ అనే మంత్రాన్ని పఠించినా సరిపోతుంది. శ్లోకం, మంత్రం పఠించలేకున్నా.. సింపుల్‌గా “ఓం వామనాయ నమో నమః” అని చదువుకుంటూ దీపం పెడితే ఫలితం అద్భుతంగా ఉంటుందట.

వరూధిని ఏకాదశి నాడు లక్ష్మీదేవిని పూజించుకున్నా ఫలితం చాలా బాగుంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టి పాలలో కుంకుమ పువ్వు లేదంటే కుంకుమను వేసి అభిషేకం చేయాలి. అలాగే విష్ణుమూర్తికి కూడా పాలాభిషేకం చేస్తే ఏడాదంతా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధిస్తాయట. వరూథిని ఏకాదశి నాడు వైష్ణవాలయాలను దర్శించుకోవాలి. అనంతరం ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించి ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ సమయంలో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నారాయణాయ, ఓం వామనాయ నమః’ వంటి మంత్రాలను పఠిస్తే మంచి జరుగుతుంది.

Share this post with your friends