భాను సప్తమి ఈ ఏడాది ఎప్పుడు రానుందో తెలుసా?

హిందూ సంప్రదాయంలో నిత్యం ఏదో ఒక దేవుడిని పూజిస్తూనే ఉంటారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయస్వామి, బుధవారం అయ్యప్పస్వామి ఇలా ఆదివారం రోజు సూర్యభగవానుడిని పూజిస్తారు. ఆదివారం ఉదయాన్నే స్నానమాచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బాగుంటుందని నమ్మకం. సాధారణ ఆదివారాల్లో కంటే భాను సప్తమి రోజు సూర్య ఆరాధన మరింత ప్రయోజనం అని పండితులు చెబుతున్నారు. అసలు భాను సప్తమి ఎప్పుడు రానుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ రోజైతే ఆదివారం నాడు సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అంటారు. ఇక ఈ ఏడాది భానుసప్తమి ఏప్రిల్​ 20వ తేదీ వచ్చింది. ఈ భాను సప్తమికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. విజయ సప్తమి, కల్యాణ సప్తమి అని కూడా అంటారు. ఆదివారం సప్తమి తిథితో వచ్చిన భాను సప్తమి రోజు సూర్యుడిని ఆరాధిస్తే సాధారణ రోజుల్లో కంటే కోటి రెట్ల ఫలితం లభిస్తుందట. స్నానం, దానం, దీపం, అర్ఘ్యం చేయడం వల్ల సంవత్సరం మొత్తం సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందట. సమస్యలన్నీ తొలగిపోయి చేపట్టే ప్రతి పనిలోనూ విజయంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యపరంగానూ చాలా బాగుంటారని నమ్మకం.

Share this post with your friends