చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అనంతరం ఇవాళ ఉదయం నుండి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నంపై స్వామివారు విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నమిచ్చారు. ఏప్రిల్ 11వ తేదీ ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 12వ తేదీ ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వర్ల‌కు, చక్రత్తాళ్వార్‌కు వ‌సంతోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. త‌రువాత ఉద‌యం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉద‌యం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల సేవ జ‌రుగ‌నుంది.

Share this post with your friends