ఆధ్యాత్మిక నగరం వారణాసికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా వారణాసి నిలిచింది. విశ్వాస ఆధారిత పర్యాటక ధోరణులను మైక్రాస్ అనే సంస్థ విశ్లేషిస్తూ ఉంటుంది. అది నిర్వహించిన ప్రపంచ అధ్యయనం ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐదు అంశాల ఆధారంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరాల ఎంపికను మైక్రాస్ చేపట్టింది. వార్షిక సందర్శకుల సంఖ్య, నగరంలో మతపరమైన ప్రదేశాల సంఖ్య తదితర ఐదు అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో అగ్రస్థానంలో జపాన్లోని టోక్యో నిలవగా.. తర్వాతి స్థానంలో కాశీకి టాప్ ప్లేస్ దక్కింది.
వారణాసి నగరానికి ఏడాదికి 11 మిలియన్ల మంది సందర్శకులు వస్తున్నారు. వసతి సౌకర్యం కల్పించే విషయంలో టోక్యో కంటే కాశీయే అగ్రస్థానంలో ఉంది. వారణాసి నగరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పరంగానే కాకుండా.. ముఖ్యంగా గంగానదిలో చేసే పవిత్ర స్నానాలు .. గంగా తీరంలో ఘాట్లపై పూర్వీకుల కర్మలను ఆచరించే హిందువులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు. కాగా.. వారణాసికి దక్కిన గౌరవంపై యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పందించారు. వారణాసి ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక గమ్య కేంద్రంగా కాశీ గుర్తింపు పొందడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు.