చైత్రమాసంలో జరుపుకునే పండుగల్లో అశోకాష్టమి కూడా ఒకటి. చాలా మంది ఈ పండుగ గురించి విని ఉండరు. దీపావళి మాదిరిగానే ఈ పండుగను సైతం చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా అశోకాష్టమిని జరుపుకుంటాం. చైత్ర శుద్ధ అష్టమి రోజున అశోకాష్టమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ అంటే నేడు దేశమంతా అశోకాష్టమిని జరుపుకుంటోంది. అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? ఈ రోజున ఎవరిని పూజిస్తారో తెలుసుకుందాం. శోకాన్ని తొలగించే పండుగనే అశోకాష్టమి అని చెబుతారు.
అశోకాష్టమి రోజనున దుర్గాదేవిని శక్తిరూపంలోనూ, పరమశివుని లింగరాజు రూపంలో పూజించడం సంప్రదాయం. ఈ పండుగ దక్షిణాది వారికి పెద్దగా తెలియదు. ఒడిశాలో మాత్రం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భువనేశ్వర్లో ప్రఖ్యాతిగాంచిన లింగరాజ ఆలయం ఉంది. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శక్తి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అశోకాష్టమి రోజు భువనేశ్వర్లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయంలో పెద్ద ఎ త్తున రథయాత్ర జరుగుతుంది. దీనికి పొరుగురాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి వస్తారు.