
పంచ గయల గురించి చెబుతూనే ఉంటారు. అయితే పంచగయలు ఏంటనేది మాత్రం చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. అవి.. 1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ. ఈ ఐదు గయల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
1. శిరోగయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ” గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.
2. నాభిగయ : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.
3. పాదగయ : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.
4. మాతృగయ : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని ‘మాతృగయ’ అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి.మీ దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండ ప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్కి 33 కిమీ దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.
5. పితృగయ : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్లోని అలకనందా నదీ తీరంలో గల ‘బ్రహ్మకపాలం’ అనే ప్రదేశాన్ని ‘పితృగయ’ అంటారు.
