నెల్లూరు జిల్లా జొన్నవాడలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కామాక్షమ్మ ఆలయంలో భారీ కుంభకోణం జరిగింది. అమ్మవారి ఆలయ సిబ్బంది కోట్ల రూపాయాలను స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పాపంలో ఆలయ అర్చకులతో పాటు కమిటీ సభ్యులు, గతంలో పని చేసిన ఈవోలు, మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం పాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. ఆలయంలో కోట్ల రూపాయల కుంభకోణంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషాయన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే ఆనం విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
వెంటనే అమ్మవారి ఆలయంలో జరిగిన కుంభకోణంపై అధికారులు మూడు రోజులు పాటు విచారణ జరపడంతో ఆలయంలోని అవినీతి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బటయకువస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు మాజీ ఛైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం, అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. ఆలయ వార్షిక ఆదాయం రూ.10కోట్లు అయినా అప్పులున్నట్టు తప్పుడు లెక్కలు సృష్టించినట్టుగా అధికారుల విచారణలో తేలింది. భక్తులు సమర్పించిన భారీ విరాళాలు సైతం మాయమయ్యాయి. ఈ ఆలయంలో మహాశివుడి విగ్రహం కోసం అజ్ఞాత భక్తుడు ఇచ్చిన రూ.25లక్షలను సైతం స్వాహా చేశారు.