ఇవాళ మనం తెలుసుకోబోయే దేవాలయం మన అందరికి తెలిసినదే.. మనం చాలా సార్లు ఈ దేవాలయం పేరు వినే ఉంటాం… ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అన్ని దేవాలయాల లాగా సంప్రదాయ గంటలు ఉండవు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్లోని బిర్లా మందిర్, నౌబత్ పహాడ్ అనే కొండపై ఉన్న ఒక ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర దేవాలయం. ఇది పూర్తిగా తెల్లటి పాలరాతితో నిర్మించబడింది. బిర్లా ఫౌండేషన్ ఈ ఆలయాన్ని 1976లో నిర్మించింది. ఇక్కడ కొలువైన ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. తిరుమల దేవాలయంలోని బాలాజీ విగ్రహానికి ఇది ఒక చిన్న ప్రతిరూపం. గర్భగుడిలో 11 అడుగుల ఎత్తైన నల్ల రాతి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం ద్రావిడ, రాజస్థానీ, మరియు ఉత్కల (ఒడిషా) నిర్మాణ శైలుల కలయికగా ఉంటుంది. రాజస్థాన్ నుండి తెచ్చిన సుమారు 2,000 టన్నుల తెల్ల పాలరాయిని ఉపయోగించి నిర్మించారు.
ఆలయంలో సంప్రదాయ గంటలు ఉండవు. ధ్యానానికి అనుకూలమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో స్వామి రంగనాథానంద ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన దేవాలయంతో పాటు, ఆలయ సముదాయంలో పద్మావతి, ఆండాళ్, శివ, గణేష్, సరస్వతి, హనుమాన్, బ్రహ్మ, లక్ష్మి, మరియు సాయిబాబా వంటి ఇతర దేవతలకు కూడా ప్రత్యేక ఆలయాలు ఇక్కడ నిర్మించారు.

కొండపై ఉన్న కారణంగా, ఈ దేవాలయం నుండి హుస్సేన్ సాగర్ సరస్సుతో పాటు హైదరాబాద్ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. రాత్రిపూట వెలుగులతో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి.
