అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజున బంగారం కొనడానికి కారణమేంటి?

అక్షయ తృతీయను జరుపుకునేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ పండుగ నాడు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించుకోవడం ఆనవాయితీ. హిందువులు జరుపుకునే పవిత్రమైన తిథుల్లో అక్షయ తృతీయను కూడా ఒకటిగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ నాడు ఏ శుభకార్యం చేయడానికైనా చాలా మంచిదని బావిస్తుంటారు. ముఖ్యంగా ఈ రోజున వెండి, బంగారం, వాహనం వంటి వస్తువులు కొన్నా లేదంటే ఏదైనా స్థలాన్ని లేదంటే ఇంటిని కొనుగోలు చేసినా చాలా మంచిదని చెబుతారు. ఈ రోజున వీటిలో ఏది కొన్నా ఆ ఇంట ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయని నమ్మకం.

ఈ నెల 30వ తేదీన మనం అక్షయతృతీయను జరుపుకోనున్నాం. వాస్తవానికి కాస్త డబ్బున్న వారు బంగారం కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. దీనికి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. సాగన మథనం సమయంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథిస్తున్న సమయంలో చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టిందని చెబుతారు. అలా బయటపడిన వాటిలో బంగారం కూడా ఒకటని అంటారు. ఈ బంగారాన్ని శ్రీ మహా విష్ణువు ధరించాడు. కాబట్టి బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఈరోజున బంగారాన్ని కొని ఇంటికి తీసుకొస్తే దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని నమ్మకం.

Share this post with your friends