
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగను మరికొన్ని గంటల్లో జరుపుకోబోతున్నాం. ఇది తెలుగువారి తొలి పండుగ తెలుగు రాష్ట్రాల వారికి అతి పెద్ద పండుగలో ఇది కూడా ఒకటి ఉగాది నాడు ఉదయాన్నే తేదీ ఇంటిల్లిపాదీ తలస్నానం మామిడి తోరణాలు కట్టి అంచుగా అలంకరించుకుంటారు. ఉగాది పచ్చడి, ఆలయ దర్శనం, పంచాంగ శ్రవణంతో రోజంతా సందడిగా గడిచిపోతుంది. ఎన్నో శాననాల్లో ఉగాది ప్రస్తావన ఉంది. ఈ పండుగను మనం ఎప్పటి నుంచి చేసుకుంటున్నానం? ఎన్ని శతాబ్దాల క్రితం ఈ పండుగ మొదలైంది? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉగాది పండుగ వస్తుందంటేనే తెలుగు వారు సంబరపడిపోతుంటారు. తెలుగు సంవత్సరం అనేది ఈ పండుగతోనే ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితి కాబట్టి ఈ పండుగను మాసం మార్చి 30న జరుపుకోనున్నాం. ఉగాది పండుగ శాతవాహన రాజవంశు నాటిది శాతవాహనుల కాల నుంచే తెలుగు వారు ఈ పండుగను జరుపుకునే వారని శానకాలు చెబుతున్నాయి. ఈ రాజవంశు 236 బీసీ నుంచి 2200 ఏడి దాకా పాలించింది. ప్రస్తుతమున్న తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను శాతవాహనులు పాలించారు.
