నేడు ఎంఎస్ రామారావు వర్థంతి.. ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ఈరోజు (ఏప్రియల్ 20) సినీ నేపద్య గాయకుడు, ఎంఎస్ రామారావు వర్ధంతి (1992). తొలి తెలుగు సినీ నేపథ్య గాయకుడిగా ఆయన ప్రస్థానం మరువలేనిది. గుంటూరు జిల్లా అమృతలూరు వద్ద మోపర్రు గ్రామంలో మోపర్తి రంగయ్య- మంగమ్మ దంపతులకు 3 జూలై 1921న ఎంఎస్ రామారావు జన్మించారు. చిన్నతనం నుంచి ఆయనకు పాటలపై వల్లమాలిన అభిమానం ఉండేది. ఈ క్రమంలోనే కళాశాల స్థాయిలోనే పాటల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. 1944లో ‘తహసిల్దార్’ సినిమా కోసం తొలి పాట పాడారు. రాజమండ్రి నవభారతి గురుకులంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.

ఒకవైపు సినిమాలకు గాత్ర సహకారం అందిస్తూనే మరోవైపు ఆకాశవాణిలో సుందరకాండ గేయ రచన స్వీయ బాణీల్లో ఆలపించేవారు. ‘నీరాజనం’ చిత్రంలో ‘ఈ విశాల ప్రశాంత’ అనే పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఎంఎస్ రామారావు 20 ఏప్రిల్ 1922లో పరమపదించారు. ప్రస్తుతం ఆయన మనవడు డా. పి శ్రీనివాస్, శ్రీ సుందరదాస్ ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచ వేదికలపై హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తూ ఆ మహనీయుడి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

Share this post with your friends