మనకు తెలిసి శని సింగనాపూర్లో మాత్రమే ఆలయాలకు తలుపులు ఉండవు. అక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆలయాలకే కాదు.. ఎక్కడా ఏ ఇంటికీ.. చివరకు బ్యాంకుకు కూడా తలుపులు ఉండవు. అలాంటి ఆలయం మరెక్కడైనా ఉందా? అంటే ఎక్కడో కాదు.. ఏపీలోనే ఉంది. సూళ్లూరుపేట గ్రామదేవత చెంగలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయం. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ చెంగలమ్మ గురించి తెలియని వారుండరు. ఇక్కడ వెలిసిన అమ్మవారి ఆలయానికి తలుపులు, తాళాలు ఉండవు.
ఈ ఆలయంలోని అమ్మవారు దక్షిణ ఖాళీగా పేరు తెచ్చుకుంది. కాలంగి నదీ తీరాన అమ్మవారు వెలిశారు. ఐదు వందల ఏళ్లనాడు ఈ ఆలయం వెలిసిందని నమ్మకం. అమ్మవారు స్వయంగా ఆలయ పూజారికి కలలో కనిపించి తనకు తలుపులు చేయించవద్దని సూచించిందట. దీంతో అమ్మవారి తలుపుల కోసమని తెచ్చి సమద్ది చెట్టు చెక్కలను పక్కన పెట్టేశారట. ఆ తరువాత ఆసక్తికరంగా ఈ చెక్కలకు మొలకలు వచ్చి అది మహా వృక్షంగా మారిందట. ఆ వృక్షానికి కూడా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.