శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్న వారికి మరణం ఉండదట..

అమర్‌నాథ్ యాత్రకు వేళవుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని పహెల్‌గావ్ నుంచి 29 కి.మీ దూరంలో ఉంటుందీ క్షేత్రం. ఎత్తైన కొండపైన ఉన్న గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్‌కు తరలివస్తారు. అయితే ఈ అమర్‌నాథ్ యాత్ర అంత సులువేమీ కాదు.. చాలా ప్రమాదకరమైనది. ఇక ఈ అమరానాథుని దర్శనం ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే ఉంటుంది. సహజంగా మంచుతో ఇక్కడ శివలింగం ఏర్పడుతుంది. ఇక ఈ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది.

ఆగస్టు 19 వరకూ అమరనాథ్ యాత్ర కొనసాగనుంది. ఈ ఆలయంలో సైన్స్‌కు అందని అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు చాలా మంది యత్నించారు కానీ ఎవరికీ సాధ్యపడలేదు. ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అమరత్వం గురించి విన్న వారికీ మరణం ఉండదట. అయితే మనిషై పుట్టాక మరణం తప్పదు కాబట్టి ఇక్కడ అమరత్వం అంటే.. పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడమేనని చెబుతారు.

Share this post with your friends