ఆలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి?

ధ్వజస్తంభానికి జీవధ్వజం, దారు బేరం అనే మరో పేరు కూడా ఉంది. దారువు అంటే చెక్క అని అర్థం. మద్ది, పనస, బొగడ, వేగిస, రావి, మారేడు, మోదుగ వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తుంటారు. ధ్వజస్తంభం కింద కూర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. వైష్ణవాలయాల్లో పైన పతాకం లాగ మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్లు ధ్వజస్తంభం ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా ఉన్న వాటిని మేఖల అని అంటారు. చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును వేస్తుంటారు. కొన్ని కొన్ని ఆలయాల్లో వెండి, బంగారుపు తొడుగులను వేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మానవదేహమే దేవాలయంగా పాదం నుంచి శిరస్సు వరకు వ్యాపించి నిటారుగా నిలిచి ఉన్న ధ్వజస్తంభం.

ప్రదక్షిణలు చేసే సమయంలో మెల్లగా నడవాలి. అంతేతప్ప, వేగంగా పరుగెత్తినట్లు ప్రదక్షిణ చేయకూడదు. ప్రదక్షిణం చేసే సమయంలో చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఆయా దేవతలకు సంబంధించిన అష్టోత్తరనామాలను చెపుతూ ప్రదక్షిణ చేయడం మంచిది. అష్టోత్తరనామాలు తెలియనివారు పరమాత్మను ధ్యానిస్తూ, లేక ఆ స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, మనస్సు, ఆలోచనలు స్వామిపైనే కేంద్రీకరింపజేసుకోవాలి. సాధారణంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. సాధారణంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చాలామంది మనసులు ప్రదక్షిణల సంఖ్యను లెక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమై ఉంటుంటాయి. అలా చేస్తే ఫలితముండదు. ఒక పేపర్‌ను తీసుకుని దానిపై నంబర్స్ వేసుకుంటూ తిరిగితే ఇబ్బంది ఉండదు.

Share this post with your friends