
శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో ఆరాధిస్తుంటారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, ప్రసాదాన్ని సమర్పించి పూజిస్తాం. ముఖ్యంగా అమ్మవారిని కొన్ని ప్రత్యేక పూలతో పూజించాలి. ఈ నేపథ్యంలో వాడకూడని పుష్పాలేంటో తెలుసుకుందాం.
గరిక: దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని గరికపోచలతో పూజించకూడదట. దీనికి కారణమేంటంటే.. దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి.. మరోవైపు గరిక ఉష్టాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అమ్మవారి ఉగ్రతత్వాన్ని తగ్గించే గరికతో దుర్గమ్మను పూజించకూడదట.
మల్లెపూలు: చండీ అమ్మవారు కూడా ఉగ్రత్వంతో ఉంటుంది. మల్లెపూలకు శాంతింపచేసే గుణం ఉంటుంది కాబట్టి వాటితో పూజించకూడదట. ఆసక్తికర విషయం ఏంటంటే.. చండీ అమ్మవారికి కాకుండా ఇతర దేవతలను మల్లెపూలతే పూజిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందట. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా జీవిస్తారట.
