సింహవాహనంపై శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి వైభవం..

రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సింహ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం వైభవంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం వృషభ వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. జూన్ 2 నుంచి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపటితో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకూ స్వామివారిని వాహన సేవలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రారంభం నాటి నుంచి కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం వాహన సేవలు నిర్వహిస్తూనే ఉన్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం అంకురార్పణం, మూషిక వాహనసేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక నిన్న స్వామివారిని ఉదయం శేష వాహనంపై ఊరేగించారు. సాయంత్రం గజ వాహనంపై ఊరేగించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. జూన్ 6వ తేదీన ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends