పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ప్రతిష్టా మహోత్సవానికి బ్రహ్మాది దేవతలంతా ఏడు కోట్ల మంది హాజరు కావడంతో సప్త కోటి రామేశ్వర లింగంగా దీనిని పిలుస్తారు. అయితే ఈ శివలింగాన్ని వైశాఖ మాసంలో మాత్రమే భక్తులు దర్శించుకునే వీలుంది. మిగిలిన 11 నెలలూ శివయ్య నీటిలోనే ఉంటాడు. దీనికి కారణమేంటో కూడా తెలుసుకున్నాం. అయితే వైశాఖ మాసం నిన్నటి (ఏప్రిల్ 28) నుంచి ప్రారంభమైంది.
నిన్నటి నుంచి ఈ పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకునేందుకు అధికారులు వీలు కల్పించారు. ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి భక్తులకు స్వామి దర్శనం చేసుకునే వీలును అధికారులు కల్పిస్తున్నారు. మే 28 వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో యాళ్ల సూర్యనారాయణ తెలిపారు. 28న వైశాఖ మాసం ముగుస్తుంది. దీంతో దర్శనాలు కూడా ముగుస్తాయి. మే5న వైశాఖ సోమవారం, మే 12న వైశాఖ మాస పౌర్ణమి, 19న వైశాఖ సోమవారం, 22న హనుమాన్ జయంతి తో పాటు 25న మాస శివరాత్రి, 26న వైశాఖ సోమవారం.. 27న వైశాఖ మాసం చివరి రోజును పర్వ దినం. కాబట్టి ఈ రోజుతో దర్శనాలను ముగించి.. స్వామికి మహానివేదన సమర్పించి తిరిగి ఆలయాన్ని నీటితో తిరిగి నింపుతారు.