శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్ఫణ జరగనుంది. ఇప్పటికే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జేఈవో శ్రీ వీర‌బ్రహ్మం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించనున్నారు. తిరిగి జూన్ 25న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 11వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ.. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు దంపతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు.

Share this post with your friends