
ఆంజనేయుడు అంటే భక్తి, బలం, ధైర్యానికి చిరునామా. ఆయన మందిరాలు దేశమంతా భక్తులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఆలయం ఒక ప్రత్యేక కథను, విశిష్ట శక్తిని కలిగి ఉంది. ఇప్పుడు భారత్లోని అత్యంత శక్తివంతమైన 5 ఆంజనేయ ఆలయాల యాత్రన చూద్దాం…
1. యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం
పద్మాసనంలో కూర్చొన్న హనుమంతుని విగ్రహం యంత్రంతో కూడి ఉంటుంది. విజయనగర సామ్రాజ్య రాజగురు శ్రీ వ్యాసరాయుల వారు ప్రతిష్ఠించిన ఆలయం ఇది. ఇది కర్ణాటకలోని హంపిలో ఉంది. బళ్లారి ఎయిర్పోర్టు నుంచి 60 కి.మీ దూరంలోనూ.. హోసపేట రైల్వే స్టేషన్ నుంచి 13 కి.మీ దూరంలో ఉంది.
2. హనుమాన్ గఢీ
అయోధ్యను రక్షించే దేవుడిగా హనుమంతుడు పూజించబడే ఆలయం. 76 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం లభిస్తుంది. కోరికలు నెరవేరడానికి ఇది ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని హనుమాన్ గర్హిలో ఉంది. అయోధ్యకు రైలు లేదంటే విమానం ద్వారా చేరుకోవచ్చు.
3. నమక్కల్ ఆంజనేయర్ ఆలయం
ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. నరసింహ స్వామికి హనుమంతుడు నమస్కరిస్తూ ఉన్నట్టుగా దర్శనమిస్తాడు. వినయాన్ని ప్రతిబింబించే దేవాలయం. ఇది తమిళనాడులో ఉంది. నమక్కల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి వెళ్లవచ్చు.
4. సంకట మోచన్ ఆలయం
గోస్వామి తులసీదాస్ స్థాపించిన ఆలయం. భక్తులను చూడటం కోసం ఎదురుగా ఉన్న విగ్రహం. కోరికలు తీరే స్థలంగా ప్రసిద్ధి. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంటుంది. ఇక్కడికి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కానీ.. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కానీ చేరుకోవచ్చు.
5. అంజలి వరద ఆంజనేయ ఆలయం
హనుమంతుడు అంజలి ముద్రలో ఉండటం విశిష్టత. అంజలితో ప్రార్థించిన వారికి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇది తమిళనాడులోని చిన్నలపట్టిలో ఉంటుంది. దిండిగల్ రైల్వేస్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి ఆలయానికి వెళ్లవచ్చు.
