హిందూ సంప్రదాయంలో మకర సంక్రాంతి మహా పుణ్యదినం. 2026 జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ పర్వదినాన్ని శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు. ఈ రోజు సూర్యారాధనతో పాటు దానధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. రాశుల ప్రకారం దానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మేష రాశివారు బెల్లం… వృషభ రాశివారు బియ్యం… మిథున..కన్య రాశివారు పెసరపప్పు కిచిడి, కర్కాటక రాశివారు బియ్యం, చక్కెర, నువ్వులు దానం చేయాలి. సింహరాశివారు నువ్వులు, బెల్లం, గోధుమలు… తులారాశివారు తెల్లని బట్టలు… వృశ్చిక రాశివారు నువ్వులు… ధనుస్సు రాశివారు కుంకుమపువ్వు… మకరరాశివారు నూనె,నువ్వులు… కుంభరాశివారు పేదలకు ఆహారం… మీన రాశివారు పట్టు వస్త్రాలు, పప్పులు, బియ్యం దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల పుణ్యం లభించి, జీవితంలో సానుకూల ఫలితాలు కలుగుతాయి.

