
ద్వారక నాశనం చెప్పే సందేశం ఏమిటనేది తెలుసకుందాం. ద్వారక నాశనం మనకు ఒక గొప్ప బోధ చెబుతుంది. “ధర్మం ఉన్నంతవరకు వైభవం నిలుస్తుంది. అహంకారం వచ్చిన క్షణమే వినాశనం మొదలవుతుంది.” బంగారం ఎప్పుడూ శాశ్వతం కాదు. నగరాలు శాశ్వతం కాదు. కేవలం ధర్మం మాత్రమే శాశ్వతమని ద్వారక నాశనం మనకు చెబుతోంది. నేటి ద్వారక నిజంగా ఉందా? అంటే ఉంది అనడానికి సాక్ష్యాలు సైతం లభించాయి. ద్వారక నగరం నిజంగానే ఉంది.
గుజరాత్ సముద్ర తీరంలో సముద్ర గర్భంలో ద్వారకకు పురాతన అవశేషాలు లభించాయి. ఇవి ద్వారకకు సంబంధించినవేనని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.
అందుకే ద్వారక పురాణం + చరిత్ర = జీవంత సత్యం. అని అంటారు. మొత్తానికి ద్వారక నగరం మునిగిపోయింది… కానీ శ్రీకృష్ణుని ధర్మ బోధ మాత్రం ఇప్పటికీ మన హృదయాల్లో జీవిస్తోంది. “ధర్మం కోసం జీవించు, సత్యం కోసం నిలబడు, అహంకారాన్ని వదిలి కృష్ణుని మార్గాన్ని అనుసరించు.” ఇదే ద్వారక ఇచ్చిన శాశ్వత సందేశం.
