కార్తిక మాసంలో శివకేశవులను పూజించడం విశేషం. అందుకే ఈ మాసంలో శివాలయాలు, వైష్ణవ ఆలయాలను దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం. ప్రత్యేకంగా కార్తిక సోమవారాల్లో శివాలయాలు, కార్తిక పౌర్ణమి నాడు శివాలయాలు, విష్ణు దేవాలయాలు సందర్శించడం ఆచారం…

కార్తిక మాసంలో దర్శించదగిన కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఇవే… తారకాసురుడి సంహారం తర్వాత అతని గొంతులోని శివలింగం ఐదు ముక్కలుగా పడి, అవి ఐదు క్షేత్రాలుగా మారాయి. వీటిని పంచారామాలు అంటారు. కార్తిక మాసంలో ఈ ఐదు క్షేత్రాలను సందర్శించడం అత్యంత శ్రేష్టం.
1. అమరారామం (అమరేశ్వర స్వామి దేవాలయం, అమరావతి)
2. దక్షారామం (శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, కోనసీమ జిల్లా)
3. సోమారామం (శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, భీమవరం)
4. క్షీరారామం (శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లు)
5. కుమారారామం (శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోట)
పంచభూతాలను సూచించే ఈ ఐదు శివాలయాలను కార్తిక మాసంలో సందర్శించడం చాలా పవిత్రమైనది.. జంబుకేశ్వరార్ ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, చిదంబరం నటరాజ ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం.. ఈ ఆలయాలను సందర్శించడం అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
