దీక్ష తీసుకున్న స్వాములను వారు తీసుకున్న ఏళ్లను బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. తొలి ఏడాది దీక్ష తీసుకుంటే కన్నె స్వామిగా అభివర్ణిస్తారు. మరి రెండవ ఏడాది నుంచి ఏమని పిలుస్తారో తెలుసుకుందాం.

శరం స్వామి
కత్తి స్వామి
గంట స్వామి
గద స్వామి
పెరు స్వామి
జ్యోతి స్వామి
రవి స్వామి
చంద్ర స్వామి
వేలాయుధం స్వామి
విష్ణు స్వామి
శంఖ స్వామి
నాగ స్వామి
మురళి స్వామి
పద్మ స్వామి
త్రిశూలం స్వామి
కొండ స్వామి
ఓం స్వామి
గురు స్వామి
శబరిమల ధ్వజస్తంభ మహిమ..
శబరిమల ధ్వజస్తంభంపై ఉన్న గుర్రపు బొమ్మ స్వామివారి వాజివాహన తత్వాన్ని సూచిస్తుంది. అయ్యప్ప స్వామి రాత్రివేళ తెల్ల అశ్వముపై పరిసర ప్రాంతమంతా తిరిగి భక్తులను రక్షిస్తారని విశ్వాసం. ఆయన వనమంతా సంచరిస్తూ, దుష్ట గ్రహాలు, వన్యమృగాలు భక్తులను హాని చేయకుండా కాపాడతారని నమ్ముతారు. ఈ సత్యం “హరివరాసనం” పాటలో.. “తురగ వాసనం స్వామి సుందరాసనం” అని వర్ణించబడింది.
