నవరాత్రులలో దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. శరన్నవరాత్రులకు మనం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. ఈ దేవీ నవరాత్రులు దుర్గాదేవికి అంకితం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ప్రతి ఏడాది ఒకసారి కాదు.. రెండు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. ఒకటి చైత్ర.. రెండోది శారదీయ నవరాత్రి. ఇవి మాత్రమే కాకుండా రెండు రహస్య నవరాత్రులను సైతం మనం జరుపుకుంటాం. ఈ నవరాత్రుల్లోనే దుర్గాష్టమి, నవమి రోజున కన్యా పూజతో సహా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు.. ఆపై విజయ దశమితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
మరి ఈసారి దేవీనవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది అశ్వీయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ లెక్కన ఈ ఏడాది నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయంటే.. 3 అక్టోబర్ 2024 అర్ధరాత్రి 12:19 గంటల నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉదయం తిథి ప్రకారం శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ తేదీన ప్రారంభమై.. 12 అక్టోబర్ 2024 శనివారం రోజున ముగియనున్నాయి. తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబరాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.