నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై.. ఎప్పుడు ముగియనున్నాయి?

నవరాత్రులలో దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. శరన్నవరాత్రులకు మనం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. ఈ దేవీ నవరాత్రులు దుర్గాదేవికి అంకితం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ప్రతి ఏడాది ఒకసారి కాదు.. రెండు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. ఒకటి చైత్ర.. రెండోది శారదీయ నవరాత్రి. ఇవి మాత్రమే కాకుండా రెండు రహస్య నవరాత్రులను సైతం మనం జరుపుకుంటాం. ఈ నవరాత్రుల్లోనే దుర్గాష్టమి, నవమి రోజున కన్యా పూజతో సహా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు.. ఆపై విజయ దశమితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

మరి ఈసారి దేవీనవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది అశ్వీయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ లెక్కన ఈ ఏడాది నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయంటే.. 3 అక్టోబర్ 2024 అర్ధరాత్రి 12:19 గంటల నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉదయం తిథి ప్రకారం శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ తేదీన ప్రారంభమై.. 12 అక్టోబర్ 2024 శనివారం రోజున ముగియనున్నాయి. తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబరాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.

Share this post with your friends