
శేషాచల కొండపై వెలసిన శ్రీవారి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో అద్భుతంగా వెలసింది. మూడు ప్రాకారాలు, శాసనాలు, ఆభరణాలు, పవిత్ర వస్త్రాలు, నైవేద్య వంటగదులు, లడ్డూ ప్రసాద పోటు – ఇవన్నీ ఆధ్యాత్మిక కాంతిని ప్రసరింపజేస్తాయి. అనేక రాజులు, రాణులు, సేనాధిపతులు, భక్తులు విరాళాల ద్వారా ఆలయాభివృద్ధికి సహకరించారు. ఆలయంలోని మండపాల మహత్స్యం ఏంటో తెలుసుకుందాం.
మహాద్వారం – 13వ శతాబ్దపు గోపురం, అనంతాళ్వారుల గునపం ఇక్కడే కట్టబడి ఉంటుంది.
కృష్ణరాయ మండపం – 16 స్థంభాలు, రాగి–రాతి విగ్రహాలతో రాజవంశాల చరిత్రను చెబుతుంది.
రంగనాయక మండపం – 1310–1320లో నిర్మితమై, ఉత్సవమూర్తులను కాపాడిన పవిత్ర స్థలం.
తిరుమలరాయ మండపం (ఊంజల్ మండపం) – శిల్పకళా వైభవం; బ్రహ్మోత్సవ ధ్వజారోహణం ఇక్కడే జరుగుతుంది.
అద్దాల మండపం (ఆఐనా మహల్) – 36 స్థంభాలతో అద్భుత నిర్మాణం, ప్రతిరోజూ డోలోత్సవం జరుగు ప్రదేశం.
ధ్వజస్తంభ మండపం – 1470లో నిర్మితమై, బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం కలిగిన పుణ్యస్థానం.
వసంత మండపం – మహాప్రదక్షిణలో నైరుతి మూలలో ప్రత్యేకంగా వెలసినది.
కళ్యాణ మండపం – 1586లో నిర్మితమై, స్వామివారి కల్యాణోత్సవానికి వేదిక.
