శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలోని ప్రతి శ్లోకం లోకానికి వెలుగునిచ్చే దివ్య జ్ఞానం. ఆ అమృత వాణిని మరింత మహిమాన్వితంగా నిలిపేలా, ఢిల్లీకి చెందిన ఓ మహాభక్తుడు సుమారు 2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో స్వర్ణ భగవద్గీతను రూపొందించి, కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి సమర్పించబోతున్నారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో అలంకరించబడిన ఈ అపురూప గ్రంథాన్ని జనవరి 8న విశ్వగీతా పర్యాయ ముగింపు సందర్భంగా మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామివారికి బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించనున్నారు. జగద్గురు శ్రీ మధ్వాచార్యులు స్థాపించిన ఈ పవిత్ర ఆలయంలో స్వర్ణ భగవద్గీత ఆవిష్కరణ ఒక ఆధ్యాత్మిక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఇది ఐశ్వర్య ప్రదర్శన కాదు… శ్రీకృష్ణుడి బోధనలపై భక్తి, కృతజ్ఞతకు అర్పణగా భక్తులు భావిస్తున్నారు.

