శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం పార్వేట ఉత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తరువాత గురువారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే గురువారం పెద్ద ఎత్తున పార్వేట ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends