చెన్నైలో యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం

తమిళనాడు రాష్ట్రం చెన్నైలో కొలువైన శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 16న అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. 11 రోజుల పాటు అంటేఈ నెల 26 వరకూ పెద్ద ఎత్తున జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులను క‌టాక్షించారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఆలయ అధికారులు సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి వివిధ రకాల వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

Share this post with your friends