మే 11 నుంచి రిషికేష్‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 6వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మే 18వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ

11-05-2025

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 10.50 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – పెద్దశేషవాహనం

12-05-2025

ఉదయం – చిన్నశేషవాహనం

సాయంత్రం – హంసవాహనం

13-05-2025)

ఉదయం – సింహవాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

14-05-2025

ఉదయం – కల్పవృక్షవాహనం

సాయంత్రం – సర్వభూపాలవాహనం

15-05-2025

ఉదయం – పల్లకీ ఉత్సవం

సాయంత్రం – గరుడవాహనం

16-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజవాహనం

17-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

18-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – శ్రీవారి కల్యాణోత్సవం, అశ్వవాహనం

19-05-2025

ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 9 నుండి 9.45 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends