ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 6వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మే 18వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
11-05-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 10.50 నుండి 11.15 గంటల వరకు)
సాయంత్రం – పెద్దశేషవాహనం
12-05-2025
ఉదయం – చిన్నశేషవాహనం
సాయంత్రం – హంసవాహనం
13-05-2025)
ఉదయం – సింహవాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
14-05-2025
ఉదయం – కల్పవృక్షవాహనం
సాయంత్రం – సర్వభూపాలవాహనం
15-05-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం
సాయంత్రం – గరుడవాహనం
16-05-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – గజవాహనం
17-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
18-05-2025
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – శ్రీవారి కల్యాణోత్సవం, అశ్వవాహనం
19-05-2025
ఉదయం – చక్రస్నానం (ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు)
సాయంత్రం – ధ్వజావరోహణం