మేడారం జాతరకు వెళ్తే కేవలం సమ్మక్క–సారలమ్మ దర్శనంతోనే కాదు, చుట్టుపక్కల ఉన్న దివ్య ప్రదేశాలను చూసినప్పుడే యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. ముందుగా లక్నవరం సరస్సును చూడాలి. కొండలు, అడవుల మధ్య విరాజిల్లే ఈ సరస్సు ప్రకృతి సౌందర్యంతో మనసును నింపుతుంది. ఆ తర్వాత సమ్మక్క జన్మస్థలమైన బయ్యక్క పేటకు వెళ్లితే అమ్మవారి జీవన జాడలను కళ్లారా చూసిన అనుభూతి కలుగుతుంది. మేడారం సమీపంలోని గిరిజన మ్యూజియం ఆదివాసీ సంస్కృతి, వీర వనితల చరిత్రను హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది. కాకతీయుల వైభవానికి ప్రతీక అయిన రామప్ప ఆలయం దర్శనం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచుతుంది. చివరగా బోగత జలపాతం… పచ్చని ప్రకృతి మధ్య జలధారల శబ్దం మనసుకు ప్రశాంతతనిస్తుంది. మేడారం యాత్ర అంటే భక్తి, ప్రకృతి, చరిత్ర అన్నీ కలిసిన ఓ అందమైన అనుభూతి.

