Kumararamam temple History : సామర్లకోటలోని కుమారరామం ఆలయ విశిష్టతలేంటంటే..

సామర్లకోటలో శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించాడని చెబుతారు. అందుకే దీనికి కుమారారామంగా పేరు వచ్చింది. చాళుక్య భీముడు నిర్మించడం వల్ల ఇక్కడి స్వామివారు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్ప కళా వైభవాన్ని కలిగి ఉంది. 1340-1466 మధ్య కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. కాకతీయులు కూడా ఈ మందిరాన్ని కొంత మేర పునర్నిర్మించారు. అందువల్లనే ఈ ఆలయంలో తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళతో పాటు కాకతీయుల నాటి శిల్ప కళను కూడా మనకు కనిపిస్తుంది. ఆలయ విశిష్టతల గురించి తెలుసుకుందాం.

సామర్లకోటలోని కుమారరామం ఆలయ విశిష్టతలేంటంటే..
సామర్లకోటలోని కుమారరామం ఆలయ విశిష్టతలేంటంటే..

శివలింగం ప్రత్యేకతలు ఏంటంటే.. ఇక్కడి శివలింగం సున్నపు రాయితో నిర్మితమైంది. కాబట్టి ఈ ఆలయం తెల్లని రంగులో.. దాదాపు 14 అడుగుల ఎత్తు కలిగి, రెండంతస్తుల మండపం వరకూ విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. శివలింగం అంతకంతకూ పెరిగిపోతోంది. అందుకే శివలింగంపై పైభాగాన శిల్పులు చీల కొట్టారనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. భక్తులు మొదట మొదటి అంతస్తులో లింగ దర్శనం చేసుకుని, ఆపై కింది అంతస్తులో లింగ పాద భాగాన్ని దర్శించుకుంటారు.

Share this post with your friends