దారుకావనంలోని రాక్షసులందరినీ పార్వతీదేవి శివ భక్తులుగా మార్చేసింది. దారుక దంపతులను రాక్షస ప్రవృత్తిని వీడి.. శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకూ కాపాడాలని పార్వతీదేవి చెప్పిందట. ఇప్పటికీ దారుక దంపతులు అదృశ్య రూపంలో నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కాచుకుని ఉన్నారట. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం అనేది చాలా గొప్పదిగా చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలో కెల్లా ఇది శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే వ్యాపారంలో నష్టపోయిన వారు తిరిగి నిలదొక్కుకుంటారట. అంతేకాకుండా వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుందట.

కలి దోషం ఉన్నవారు సైతం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే అదంతా తొలగిపోతుందని చెబుతారు. అంతేకాకుండా ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుడిని ప్రత్యేకంగా కాకుండా అమ్మవారితో కలిపి అర్చన చేయడం వలన సకల శుభాలు పొందుతారని నమ్మకం. అలాగని సాక్షాత్తు పరమేశ్వరుడే వరమిచ్చాడట. ఈ విషయాన్ని శివపురాణం చెబుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా క్షేత్రాన్ని దేవభూమిగా పేర్కొంటారు. ఈ దేవభూమికి 12 కిలోమీటర్ల దూరంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే రైలు, బస్సు, విమాన సౌకర్యాలున్నాయి. ఇక ఆలయం వచ్చేసి ఉదయం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకూ తెరిచి ఉంటుంది.
