Hasthinapuram Sai Baba Temple History : మరో శిర్డీగా విరాజిల్లుతున్న భాగ్యనగరంలోని సాయిబాబా ఆలయం…ఆలయంలోకి అడుగుపెట్టగానే

భాగ్యనగరంలోని హస్తినాపురం సాయిబాబా ఆలయాన్ని భక్తులు మరో శిర్డీగా పిలుస్తారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా కనిపించే ధుని మనలోని ఆందోళనలను దహనం చేస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుంది. వేపచెట్టు కింద గురుస్థానం దర్శించుకుని ప్రధాన మండపంలోకి వెళ్లగానే చిరునవ్వుతో దర్శనం ఇచ్చే సాయినాథుని దివ్య రూపం మనసుకు అపారమైన శాంతిని ఇస్తుంది. ఎంతటి సమస్యలతో వచ్చినా, ఒక్కసారి బాబాను చూస్తే మనసు తేలికపడుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతిరోజూ అభిషేకాలు, నాలుగు హారతులు శ్రద్ధగా జరుగుతాయి. ప్రతి గురువారం జరిగే పల్లకీ సేవలో యువత ఎక్కువగా పాల్గొనడం విశేషం. విద్యార్థులు భక్తితో పల్లకీ మోస్తే చదువులో పురోగతి కలుగుతుందని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో రామాలయం, గణపతి మందిరం, నవగ్రహాల దర్శనం కూడా లభిస్తుంది. “సబ్ కా మాలిక్ ఏక్” అనే బాబా సందేశాన్ని ఆచరిస్తూ కులమత భేదాలు లేకుండా అందరూ ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. నిజమైన భక్తితో వెళ్లినవారికి సాయినాథుని కటాక్షం తప్పక లభిస్తుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది.

Hasthinapuram Sai Baba Temple History
Hasthinapuram Sai Baba Temple History
Share this post with your friends