Site icon Bhakthi TV

శాకంబరీ దేవి కథేంటి?

ఆషాఢంలో బోనాలే కాదు.. శాకంబరీ దేవి ఉత్సవాలు సైతం జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ శాకంబరీ దేవి కథేంటి అంటారా? ప్రజలకు కష్టం వస్తే అమ్మవారు చూస్తూ కూర్చోదు.. ఏదో ఒక రూపంలో తన చేయి అందించి ఆ కష్టం నుంచి బయటకు లాగుతుంది. ఒకసారి లోకంలో పాపాలు పెరిగిపోయి వర్షాలు పడలేదట. దీంతో విపరీతమైన కరువు వచ్చిందట. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు సరికదా గడ్డి గింజ కూడా మొలిచే పరిస్థితి లేదట. ప్రాణులన్నీ ఆకలి దప్పులకు అల్లాడిపోతున్నాయట. ఆ తరుణంలో అమ్మవారు బిడ్డల కష్టాన్ని చూడలేక శాకంబరీ దేవిగా అవతారం ఎత్తిందట.

ప్రాణులన్నింటికీ కావల్సిన ధాన్యాలు, కూరగాయలు సమస్తం తానే సృష్టించిందట. అందుకే ఆ తల్లికి కృతజ్ఞతగా శాకంబరీ అవతారంలో ఆషాఢ మాసములో పూజించుకుంటూ ఉంటాం. అమ్మవారితో సహా ఆలయమంతా పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరిస్తారు. ఆ తరువాత వాటిన్నంటినీ ప్రసాదముగా భక్తులకు అందచేస్తూ ఉంటారు. అమ్మవారు ఇచ్చిన దానిని తిరిగి అమ్మవారికే సమర్పించడం దీని ఉద్దేశమట. అమ్మవారికి అలా సమర్పిస్తే తమ ఆహారానికి లోటుండదని భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఏటా ఆషాఢమాసంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

Share this post with your friends
Exit mobile version