Site icon Bhakthi TV

మత్తితలేశ్వర్ ఆలయ కథ ఏంటంటే..

కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని కల్లు వీరన హళ్లిలోని మఠితలేశ్వర దేవాలయం గురించి తెలుసుకున్నాం. ఇక్కడి మట్టి సైతం మనకు మంచి చేస్తుంది. మఠితలేశ్వరాలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆది, గురువారాలైతే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయం మద్ది చెట్టు కింద ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి మఠితలేశ్వరాలయం అని పేరు వచ్చింది. అలాగే శివయ్యకు మత్తితలేశ్వర్ అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం.

పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అపర శివభక్తుడైన ఒక సాధువు నివసించేవాడట. ఆయన మద్ది చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండేవాడట. దీంతో సాధువు చుట్టూ ఒక చీమ పుట్ట ఏర్పడిందట. అక్కడికి ఓ ఆవు రోజూ వచ్చి పుట్ట దగ్గర తను పొదుగు నుంచి పాలు కార్చేదట. ఒకరోజు గ్రామ పెద్ద దానిని గమనించి పుట్ట దగ్గరకు వెళ్లి చూడగా శివలింగం కనిపించిందట. ఆ తరువాత గ్రామ పెద్దకు కలలో శివలింగం కనిపించి తాను ఆ ప్రదేశంలో స్థిరపడతానని చెప్పాడట. అక్కడే ఆలయాన్ని నిర్మించారట. మద్ది చెట్టు కింద వెలిశాడు కాబట్టి శివయ్యను మత్తితలేశ్వర్ అని పిలుస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version