Site icon Bhakthi TV

ఈసారి శాకంబరీ ఉత్సవాలు 16 రోజులు.. కారణమేంటంటే..

శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 21 వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ప్రతి ఏటా ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు మాత్రమే జరుగుతాయి. ఈసారి మాత్రం 16 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఏడాది అధిక మాసం కారణంగా ఒకరోజు పెరిగింది. శాకంబరీ ఉత్సవాల చివరి రోజైన 21న పౌర్ణమి కావడంతో అమ్మవారు సంపూర్ణ శాకాంబరీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ 16 రోజుల పాటు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో అలంకరించనున్నారు.

ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కరువు కాటకాలనేవి ఉండవట. పైగా మనం కోరుకున్న ఏ పని అయినా చక్కగా పూర్తవుతుందట. కాగా.. శాకంబరీ ఉత్సవాలు ఆషాఢమాసంలో నిర్వహిస్తూ ఉంటారు. తొలుత భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ప్రారంభమవుతాయి. అనంతరం వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ నెల 19 నుంచి శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ అంటే కేవలం మూడు రోజుల పాటు మాత్రమే ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాకంబరీ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో ఇప్పటికే సంబంధిత అధికారులు, అర్చకులకు సూచించారు.

Share this post with your friends
Exit mobile version