Site icon Bhakthi TV

వర్షాల కోసం శ్రీ ఋష్య శృంగిని మంత్ర పఠనం

పూర్వకాలంలోనే కాదు.. ఇప్పటికీ వర్షాల కోసం యాగాలు చేస్తూనే ఉండటం చూస్తుంటాం. అయితే పూర్వ కాలంలో ఇది మరీ ఎక్కువ. అతి వృష్టి అయినా కష్టమే.. అనావృష్టి అయినా కూడా కష్టమే కాబట్టి ఈ రెండింటిలో ఏ సమస్య ఉన్నా కూడా యాగం చేసేవారు. ఈ ఏడాది సరైన వర్షాలు ఇంతవరకూ ప్రారంభం కాలేదు. వర్షాల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అనావృష్టి తొలగాలని కొన్ని రోజులుగా శ్రీ ఋష్య శృంగిని మంత్ర పఠనం జరుపుతున్నారు. పాత శివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మంత్ర పఠన తర్వాత సాక్షాత్శ్రీ ఋష్య శృంగిని ప్రతిరూపమైన శివుడికి జలాభిషేకం చేసి భారతదేశంలో సకాలంలో వర్షాలు పడాలని భక్తులు, మహిళలు కోరుకుంటున్నారు. ఈ ఈ పూజ, అభిషేకం కారణంగా వర్షాలు పడతాయని.. ప్రజలు సుఖశాంతులతో ఉంటారని నమ్మకం. అలాగే అనావృష్టి తొలగిపోయి సమృద్ధి వర్షాలు కురుస్తాయని ఆలయ పూజారులు చెబుతున్నారు. రైతులు కూడా ఈ మంత్ర పఠనంతో అయినా భగవంతుని కృపాకటాక్షాలతో వర్షాలు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు జలాభిషేకం చేసి వర్షాలు సమృద్ధిగా కకురవాలని కోరుతున్నారు.

Share this post with your friends
Exit mobile version