Site icon Bhakthi TV

తిరుమలలో జూన్ 22న శ్రీవారి పున్నమి గరుడసేవ

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22న శనివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

జ్యేష్టా నక్షత్రంతో ముగిసే జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉంటే ఆ రోజు శ్రీవారి పున్నమి గరుడ సేవ కూడా కమనీయంగా జరుగుతుంది. అయితే భక్తులు తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే.. ముఖ్యంగా ఈ గరుడ సేవ చూసిన వారికి అష్టైశ్వర్యాలు తప్పక సిద్ధిస్తాయట. ఇక జ్యేష్టాభిషేకం ముగిసిన అనంతరం స్వామివారు, ఉభయ దేవేరులకు బంగారు కవచం అలంకరిస్తారు. ఈ బంగారు కవచంలోనే వచ్చే ఏడాది వరకూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను దర్శించుకుంటే ఇహ లోకంలో సకల సౌఖ్యాలు పొందుతారట. అలాగే వైకుంఠాన్ని చేరుతారని పండితులు చెబుతారు.

Share this post with your friends
Exit mobile version