Site icon Bhakthi TV

సందడిగా లాల్ దర్వాజా బోనాలు.. 116 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం..

లాల్ దర్వాజా బోనాల సందడి కొనసాగుతోంది. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజ.. పోతురాజుల ప్రదర్శనతో లాల్ దర్వాజా బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ తరపున మాజీ చైర్మన్​ మాణిక్​ప్రభు గౌడ్​ కుటుంబం తొలి బోనం సమర్పించింది. ఆ తరువాత పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి బోనం సమర్పించారు. నిజాం VI మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో లాల్ దర్వాజా బోనాలు వేడుకల సంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి అంటే116వ సంవత్సరాలుగా లాల్ దర్వాజా బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ఈ ఆలయంతో పాటు ఆదివారం అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి ఆలయం, మేళా ముత్యాలమ్మ ఆలయం , ఉప్పగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయం, ఇతర అన్ని ఆలయాలతో పాటు పాతబస్తీలోని మరో 23 ఆలయాలల్లో కూడా బోనాల వేడుకలు ఆదివారం ఏకకాలంలో జరగనున్నాయి. ఈ ఆదివారం జరిగే బోనాల కార్యక్రమంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నెలరోజుల పాటు జరిగే బోనాలు ముగియనున్నాయి. నవరాత్రులు సందర్భంగా శ్రీ మహంకాళి అమ్మవారిని సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రతిరోజూ పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.

Share this post with your friends
Exit mobile version