
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలు ఇవాళ ఉందయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిన్నసాయంత్రమే బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణకు కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ముందుగా మేదిని పూజ చేపట్టారు. ఆ తరువాత సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని ప్రతీతి. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణం నిర్వహించారు.
ఇక ఇవాళ ఉదయం 6.55 నుంచి 7.25 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన ఒకటి కావడం విశేషం.
